రూ.500 నోట్లపై తప్పుడు ప్రచారం! కేంద్రం క్లారిటీ !
Wed Jun 04, 2025 13:54 India.202506049434.jpg)
ప్రస్తుతం దేశవ్యాప్తంగా చలామణిలో ఉన్న రూ.500 విలువైన కరెన్సీ నోట్లను వచ్చే ఏడాది మార్చి నెల నాటికి దశలవారీగా రద్దు చేయనున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో, ముఖ్యంగా ఓ యూట్యూబ్ ఛానల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ)కు చెందిన ఫ్యాక్ట్ చెక్ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇది కూడా చదవండి: ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్లోనే, భూసేకరణకు రెడీ!
వివరాల్లోకి వెళితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ.500 నోట్ల చలామణిని 2026 మార్చి నాటికి పూర్తిగా నిలిపివేయనుందంటూ ఓ యూట్యూబ్ ఛానల్ వీడియో ద్వారా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్త ప్రజల్లో కొంత ఆందోళనకు దారితీయడంతో, కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం దీనిపై దృష్టి సారించింది. సదరు ప్రచారం పూర్తిగా నిరాధారమైనదని, ఇందులో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ నకిలీ ప్రచారంపై ప్రజలను అప్రమత్తం చేస్తూ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం తమ అధికారిక 'ఎక్స్' ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ‘‘ఆర్బీఐ అలాంటి ప్రకటన ఏదీ చేయలేదు. రూ.500 నోట్లు నిలుపుదల కావు. అవి చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయి’’ అని ఆ ప్రకటనలో స్పష్టంగా పేర్కొంది. ఇలాంటి నిరాధారమైన, తప్పుదోవ పట్టించే వార్తలను ప్రజలు నమ్మవద్దని కేంద్రం విజ్ఞప్తి చేసింది.
ఇది కూడా చదవండి: వైసీపీ సీనియర్ నేతకు తీవ్ర అస్వస్థత! హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు!
ఏదైనా వార్తను నమ్మే ముందు గానీ, ఇతరులకు షేర్ చేసే ముందు గానీ, దాని యథార్థతను అధికారిక వర్గాల ద్వారా ధృవీకరించుకోవాలని ప్రజలకు ప్రభుత్వం సూచించింది. ఆర్బీఐ లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడితే తప్ప, ఇలాంటి వదంతులను విశ్వసించవద్దని, అనవసరమైన ఆందోళనకు గురికావద్దని హితవు పలికింది.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!
ఏపీలో రైలు ప్రయాణికులకు గమనిక..! ఈ 7 ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు!
ఏపీలో అక్కడ కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్..! ఏకంగా 5వేల ఎకరాల్లో, ఆ ప్రాంతానికి మహర్దశ!
రిమాండ్ ఖైదీకి మరో షాక్! కోర్టు కీలక ఉత్తర్వులు!
పసిడి ప్రియులకు అలర్ట్.. బంగారం ధరల్లో మరోసారి మార్పులు.. ఈ రోజు తులం రేటు ఎంతుందంటే?
ఏపీ లిక్కర్ స్కాం కేసు నిందితులకు బిగ్ షాక్.. రిమాండ్ పొడిగింపు - జడ్జి కీలక వ్యాఖ్యలు!
కాకాణి బెయిల్ పిటిషన్ కీలక మలుపు! రూ. 250 కోట్ల క్వార్ట్జ్ మిస్టరీలో..!
బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!
గుంటూరు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు... 15 పడకలతో ఐసోలేషన్ వార్డు సిద్ధం!
కోహ్లీ రెస్టారెంట్ పై కేసు నమోదు! ఇంతకీ ఏమైందంటే?
ట్రంప్ ప్రభావం, మస్క్ యూటర్న్! టెస్లా ప్లాంట్ ఆశలు గల్లంతు.. వాటికే పరిమితం?
జూన్లో మార్కెట్లోకి 5 కొత్త కార్లు.. పాపులర్ వెహికల్స్కు అప్గ్రేడ్ వెర్షన్స్ లాంచ్!
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం సమీక్ష..! ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు!
బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!
'స్పిరిట్' వివాదం..! దీపికాకు అండగా నిలిచిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం!
వారికి శుభవార్త! ఏపీలో ఆ కొత్త బైపాస్పై కొత్తగా రింగ్! కేంద్రం గ్రీన్ సిగ్నల్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#Andhrapravasi #FactCheck #FakeNewsAlert #RBIClarification #PIBFactCheck #CurrencyMythBusted #StopFakeNews #VerifyBeforeSharing #NoNoteBan #PublicAwareness #CurrencyUpdate
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.